
● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బ
సాక్షి,చైన్నె: పర్యావరణ పరిరక్షణను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లనున్నామని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. రూ.44 కోట్లతో కాలుష్య నియంత్రణ బోర్డు, పరిశోదన కేంద్రాన్ని గిండిలో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 14 సముద్ర తీర జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న చేపల వలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.ఽ
చైన్నె నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో గురువారం రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పు, అటవీశాఖ నేతృత్వంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఇందులో చైన్నెలోని గిండిలో నిర్మించనున్న తమిళనాడు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిశోధన అభివృద్ధి లక్ష్యంగా తమిళనాడు మారిటైమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈకేంద్రం ఏర్పాటుకు శంకు స్థాపన చేశారు.14 సముద్ర తీర జిల్లాల్లో నిరుపయోగ చేపల వలల సేకరణ కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రామనాథపురం జిల్లా ధనుష్కోటిని పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. అలాగే, 1,400 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. అటవీ సంరక్షణలో ఉత్తమ సేవలను అందించిన జిల్లా స్థాయి అధికారులు, నీటి సంరక్షణలో ఉత్తమ సేవలను అందించిన స్వచ్ఛంద సేవకులకు అవార్డులను సీఎం ప్రదానం చేశారు. గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల అభయారణ్యం ధనుష్కోటిని ప్రకటించారు. ఈ అభయారణ్యంపై రూపొందించిన లఘు చిత్రాన్ని విడుదల చేశారు. మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ 524.78 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడం, రామేశ్వరం దీవుల్లో చిత్తడినేల ఉండడం వంటి అంశాలను పరిగణించి ఈ అభయారణ్యం వలస పక్షులకు నిలయం మార్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ అభయారణ్యంలో 55 జాతుల పక్షులు ఉన్నటు, మరో 73 రకాల పక్షులు వలస జాతులుగా ఉన్నట్టు వివరించారు.
భవిష్యత్తే లక్ష్యం
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు ఈ భూమికి మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తు ప్రణాళికలను ప్రశ్నార్థకం చేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈతరమే కాదు, రానున్న తరాలు సైతం స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా గ్రీన్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో గ్రీన్ తమిళనాడు నినాదంతో ముందడుగు వేశామని వివరించారు. ఏనుగులు, పులులు, వంటి వన్య ప్రాణులను సంరక్షిస్తూనే, అంతరించిపోతున్న జాతులను సైతం కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అవార్డుల ప్రదానం
విజయం మీ చేతుల్లోనే
2021లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తాము మంజాపై (పసుపు) సంచి ప్రాజెక్టును ప్రారంభించామని గుర్తుచేస్తూ, ఇది కేవలం ఒక ప్రణాళికగా ఉంటే సరిపోదు అని, ఒక ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవశ్యం ఉందన్నారు. ఇంటి నుంచి బయలు దేరే సమయంలో చేతిలో సంచి, నీటితో బాటిల్ను తీసుకుని రావడం అలవాటు చేసుకోవాలని సూచించారు. భారతదేశం అమెరికా, జపాన్, యూరప్లా మారాలంటే ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ ముఖ్యం అని సూచించారు. సామాజిక న్యాయంకోసం మాత్రమే కాకుండా, పర్యావరణ న్యాయం కోసం కూడా ప్రభుత్వం ముందుకెళుతోందని, ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను సీఎం స్టాలిన్ అందజేశారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు అత్యుత్తమ కృషి చేసినందుకు కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సి. దినేష్కుమార్, తేని జిల్లా కలెక్టర్ రంజిత్, తిరుచ్చి జిల్లా కలెక్టర్ ఎం.ప్రదీప్కుమార్, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎం ప్రతాప్లకు గ్రీన్ అవార్డులను సీఎం అందజేశారు. అటవీ పరిరక్షణలో విస్తృత సేవలు అందించిన విల్లుపురం, కరూర్, చైన్నె, కోయంబత్తూర్, తిరువారూర్ జిల్లాలకు ఉత్తమ అటవీ సంరక్షణ అవార్డులను అందజేశారు. ఈమేరకు ఐదుగురు ఉత్తమ అటవీ రేంజర్లు అవార్డులను అందుకున్నారు. అన్ని జిల్లాలు నీటి సంరక్షణలో కీలక పాత్ర, సేవలు అందించిన 38 మందికి జల సంరక్షణ అవార్డులు, ఒక్కొక్కరికి రూ.లక్షను సీఎం అందజేశారు. అలాగే, పరిశ్రమలకు స్వచ్ఛంద గ్రీన్ రేటింగ్ అవార్డుల ప్రదానం చేశారు. మంత్రులు తంగం తెన్నరసు, అన్బరసన్, ఆర్ఎస్ రాజకన్నప్పన్, ఎమ్మెల్యే కరుణానిధి, పర్యావరణం శాఖ ప్రధాన కార్యదర్శి సుప్రియాసాహు, డైరెక్టర్ ఎ.ఆర్.రాహుల్నాథ్, అటవీ సంరక్షణాధికారి శ్రీనివాస్రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేష్ కుమార్ డోగ్రా, కాలుష్య నియంత్రణ బోర్డు ర్మన్ డాక్టర్ ఎం. జయంతి, బ్రిటీషు డిప్యూటీ హైకమిషనర్ అలీమా హాలండ్, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు.

● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బ

● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బ

● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బ

● సీఎం ఎంకే స్టాలిన్ ● రూ. 44 కోట్ల కాలుష్య నియంత్రణ బ