
కాయిదే మిల్లత్కు నివాళి
● ఘనంగా జయంతి వేడుక
సాక్షి, చైన్నె: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు కాయిదే మిల్లత్ మహ్మద్ ఇస్మాయిల్ 130వ జయంతి వేడుకను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు ఆవరణలోని ఆయన సమాధి వద్దకు వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. సీఎం స్టాలిన్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అధికారిక నివాళులర్పిస్తూ సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. అలాగే, టీఎంసీ నేతలు జీకే వాసన్, జీఆర్ వెంకటేష్ అంజలి ఘటించారు ప్రతిఏటా కాయిదే మిల్లత్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు వద్ద ఉన్న ఆయన సమాధి పరిసరాలను ఉదయాన్నే సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున ముస్లిం సంఘాల నేతలు, రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి తరలి రావడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ముస్లిం పెద్దలు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు.
సీఎం స్టాలిన్ నివాళి
ఉదయాన్నే సీఎం స్టాలిన్, మంత్రుల నాజర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మేయర్ ప్రియ సమాధి వద్ద పుష్పాంజలితో నివాళులర్పించారు. సమాధిపై మల్లెపూలతో సిద్ధం చేసిన చాదర్ను సీఎం సమర్పించారు. అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తరఫున ఆ పార్టీ ప్రతినిధులు అన్వర్ రాజ, జయకుమార్తో కూడిన బృందం పలు పుష్పాలతో సిద్ధం చేసి చాదర్ను సమాధిపై కప్పి నివాళులర్పించారు. అలాగే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు ఖాదర్ మొహిద్దీన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్ పుష్పాంలి ఘటించారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్తో కూడిన ప్రతినిధులు నివాళులర్పించారు. అలాగే ముస్లిం సంఘాలు, పార్టీల నాయకులు వేర్వేరుగా తరలి వచ్చి నివాళులర్పించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కాయిదే మిల్లత్ సేవల్ని గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పాత్రను గుర్తు చేస్తూ ఆయన గొప్ప దేశ భక్తుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల మధ్య భేదం అన్నది లేకుండా సోదరత్వం పెంపునకు మిల్లత్ కృషిచేశారని తెలిపారు.

కాయిదే మిల్లత్కు నివాళి