
క్లుప్తంగా
వేలూరులో ఈవీఎంల తనిఖీ
వేలూరు: వేలూరు జిల్లాలో వివిధ ఎన్నికల కోసం వినియోగించిన ఈవీఎంలను వేలూరు కలెక్టరేట్ వెనుక వైపున ఉన్న గోడౌన్లో భద్రపరిచారు. ఈ గోడౌన్కు సీల్ వేసి పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి గోడౌన్లో ఉంచిన ఈవీఎంలను తనిఖీ చేశారు. అనంతరం ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతనిధుల ఆధ్వర్యంలో తనిఖీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నికల ప్రత్యేక తహసీల్దార్ సత్యమూర్తి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చంద్రప్రకాష్, రఘు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్షాక్తో బీమా అధికారి మృతి
అన్నానగర్: విద్యుత్షాక్కు గురై ఓ బీమా అధికారి మృతిచెందాడు. సేలం జిల్లాలోని వాళపాడికి చెందిన ప్రకాష్రాజ్ (35). ఇతను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ బీమా కంపెనీలో మేనేజర్. ఈ పరిస్థితిలో, అతను ఇంటర్న్షిప్ కోసం చైన్నె సమీపం కోడంబాక్కంలోని బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. బుధవారం అతను వల్లువర్కోట్టం సమీపంలోని దుకాణంలో టీ తాగుతున్నాడు. ఆ సమయంలో, అతను అక్కడ ఉన్న ప్రకటన బోర్డుపై చేయి పెట్టాడు. విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. నుంగంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని మహిళ దుర్మరణం
అన్నానగర్: కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. చైన్నెలోని ఓల్డ్ వాషర్మన్న్పేట ప్రాంతానికి చెందిన వలర్మతి (45). ఆమె తిరువల్లికేణిలోని భారతిసాలైలోని పుస్తక దుకాణంలో పనిచేస్తుంది. ఈమె మంగళవారం రాత్రి 9 గంటలకు పనిముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. కలైవానర్ అరంగం ఎదురుగా ఉన్న వాలాజాసాలైను దాటుతుండగా అటుగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. ఈప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అన్నా సదుక్కం పోలీసులు కేసు నమోదు చేసి కారు నడుపుతున్న అశోక్కుమార్ (70)ను అరెస్టు చేశారు. ఇతను చింతాద్రిపేట రిచ్ స్ట్రీట్లో ఎలక్ట్రానిక్స్ దుకాణం నడుపుతున్నాడు.
2018 నుంచి తమిళనాడు అనే పదం లేదు
తిరువొత్తియూరు: 2018 నుంచి రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల ముందు భాగంలో తమిళనాడు అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నా కార్మిక సంఘం యూనియన్ కార్యదర్శి కమలకన్నన్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అనేది మన రాష్ట్ర ప్రభుత్వ బస్సులకు గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి, రవాణా సంస్థ బస్సులపై పట్టణం ,ఊరు పేరు ఉన్నందున చాలా సంవత్సరాలుగా తమిళనాడు పేరు ప్రస్తావించలేదని, 2018లో కొత్త బస్సులను కొనుగోలు చేసిన సమయంలో కూడా, తమిళనాడు అనే పేరు లేకుండా ఊరు పేరు ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‘ అనే పేరు పెద్దగా ఉంటుందని రాయలేదు తప్ప, వేరే కారణం లేదన్నారు. ఇప్పుడు దాన్ని తొలగించారని ఆరోపించడం తప్పిదమే అవుతుందని తెలిపారు.
1,608 అదనపు బస్సులు
కొరుక్కుపేట: బక్రీద్ పండుగతోపాటు ముహుర్తాలు ఉన్న నేపథ్యంలో రవాణా శాఖ 1608 అదనపు బస్సులను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం బక్రీద్ పండుగ, అలాగే శని, ఆదివారాలు, 7, 8 తేదీలు వారాంతపు సెలవు దినాల్లో చైన్నె, ఇతర ప్రాంతాల నుంచి అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం చైన్నెలోని కీలంబాక్కం నుంచి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మధురై, తిరునెల్వేలి, నాగర్కోయిల్, కన్యాకుమారి, తూత్తుకుడి, కోయంబత్తూర్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్కు 520 బస్సులు, శనివారం 550 బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే శుక్రవారం చైన్నెలోని కోయంబేడు నుంచి తిరువన్నామలై, నాగపట్నం, వేలంకన్ని, హోసూర్, బెంగళూరుకు 100 బస్సులు నడుస్తాయన్నారు. తరువాత రోజు శనివారం 90 బస్సులు నడుస్తాయన్నారు. ఇంకా, మాధవరం నుంచి శుక్ర, శనివారాల్లో 24 బస్సులు, బెంగళూరు, తిరుప్పూర్, ఈరోడ్ , కోయంబత్తూర్ నుంచి వివిధ గమ్యస్థానాలకు 300 బస్సులతో మొత్తం 1,608 అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

క్లుప్తంగా