
ఎయిర్ఫోర్స్ కాలేజీ సందర్శన
కొరుక్కుపేట: కోయంబుత్తూరులోని ఎయిర్ఫోర్స్ కాలేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సీనియర్ ఎయిర్ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ ఆఫీసర్ ఎయిర్మార్షల్ పీకే ఘోష్ ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడురోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆయనకు కళాశాల కమాండెంట్ వికాస్ వాగి ఘనస్వాగతం ఫలికారు. కళాశాల ప్రాంగణంలో గౌరవ వందనం సమర్పిస్తూ ఎయిర్ మార్షల్ ఘోష్ను ఆహ్వానించారు. ఆ తరువాత కళాశాల పనితీరు గురించి ఆయనకు వివరించారు. శిక్షణ కోర్సులు, కీలక విభాగాలను పరిశీలించిన ఎయిర్ మార్షల్ ఘోష్ దేశ గగన తల భద్రత గురించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైమానికదళ అధికారులను కోరారు. భవిష్యత్ సవాళ్లను భారత వైమానిక దళం తర్వాత తరం ఫైలట్లను సిద్ధం చేయడానికి కళాశాల పరిపాలన కృషిని కొనసాగించాలని ఆయన కోరారు.