
పక్షులను భయపెట్టే థండర్ బూమ్స్
● విమానాశ్రయంలో చర్యలు
సాక్షి, చైన్నె: విమానాశ్రయం పరిసరాల్లో ఎగిరే కాకులు, ఇతర పక్షులను కట్టడి చేసేందుకు థండర్ బూమ్స్ను సిద్ధం చేశారు. వీటి నుంచి వెలువడే శబ్దం వాటిని భయపెట్టే విధంగా ఉంది. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు నాలుగు వందలకు పైగా విమానాల సేవలు ఇక్కడ జరుగుతున్నాయి. విమానాశ్రయం రన్వేకు కూతవేటు దూరంలోని పరిసరాల్లో దట్టమైన పొదళ్లతో నిండిన ప్రదేశం, కొండ ప్రాంతం, అడయార్ నదీ తీరం ఉన్నాయి. ఇక్కడ కాకులు ఇతర పక్షులు అనేకం ఉన్నాయి. ఇవి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో తీవ్ర సమస్యగా మారాయి. ల్యాండింగ్, టేకాఫ్కు ముందుగా వీటిని భయపెట్టే విధంగా గాల్లో ఫైర్ చేయడం లేదా, బాణసంచాను గాల్లో పేల్చడం చేస్తున్నారు. ఈ కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. అంతేకాదు బాణసంచాల రూపంలో నిప్పురవ్వల రూపంలో చిన్నచిన్న ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో పర్యావరణానికి హానీ కలిగించకుండా కాకులు, పక్షులు రన్వేలోకి రాకుండా బెదిరించే విధంగా కొత్త బాటను ఎంపిక చేశారు. ఇందులోభాగంగాఽ థండర్ బూమ్స్ పేరిట సిద్ధం చేసిన ఈ పరికరం నుంచి వెలువడే శబ్దం, ఇందులో నుంచి వెలువడే వెలుతురు వర్షం పడే సమయంలో ఉండే ఉరుములు, మెరుపులను తలపించే విధంగా ఉండడం గమనార్హం. వీటిని బుధవారం విమానాశ్రయం రన్వే పరిసరాల్లో ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు పరిశీలించారు. 30 పరికరాలను సిద్ధం చేశారు. పర్యావరణ కాలుష్యానికి ఆస్కారం ఇవ్వకుండా, నిప్పు రవ్వులు బయటకు రాకుండా ఉండే రీతిలో ఈ థండర్ బూమ్స్ ద్వారా భయపెట్టే పక్షులను పనిలో పడ్డారు. అలాగే, రన్వేలో దూసుకెళ్లేందుకు వీలుగా టిప్ పింక్ కార్డ్ వాహనాలను సైతం రంగంలోకి దించారు.