
తాగునీటి ఆదాపై మారథాన్తో అవగాహన
పళ్లిపట్టు: తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించే విధంగా అత్తిమాంజేరిపేటలో నిర్వహించిన మారథాన్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్తిమాంజేరిపేట నెల్లికుండ్రం మురుగన్ లయన్స్ క్లబ్ ద్వారా తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం వాక్ మారథాన్ పోటీలకు ఏర్పాట్లు చేశారు. షోళింగర్ రోడ్డులోని కోరకుప్పం నుంచి అత్తిమాంజేరిపేట వరకు 6 కి.మీ దూరం మారథాన్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువతీ, యువకులు పేర్లు నమోదు చేసి పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మారథాన్లో 500కు పైగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్తిమాంజేరిపేట సంత ప్రాంగణం వరకు 6 కిలోమీటర్ల దూరం సాగిన మారథాన్ పోటీల్లో విజేతగా కాంచీపురం జిల్లాకు చెందిన యువకుడు 17.37 నిమషాల్లో చేరుకున్నాడు. మారథాన్ విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎంకే.రామచంద్రన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మెడిమిక్స్ కంపెనీ ప్రతినిధి సౌందర్, విద్యావేత్తలు గురుమూర్తి, పళని మొదటి బహుమతిగా పశ్చల పాఠశాల ద్వారా రూ. 10వేల గనదు, మెడల్, సర్టిఫికెట్ పంపిణీ చేశారు. రెండవ బహుమతిగా రూ.5వేలు, మూడవ బహుమతి రూ.3వేలు పంపిణీ చేసి సర్టిపికెట్లు, మెడల్తో అభినందించారు. అలాగే మారథాన్ల్లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ నిర్వాహకులు మహేష్కుమార్, శివలింగం, కదిరవన్, సుందరం, శరవణన్, ప్రకాశం, భూపతి, మోహన్, రాజీవ్గాంధీ, శశికుమార్ పాల్గొన్నారు.

తాగునీటి ఆదాపై మారథాన్తో అవగాహన