తిరువళ్లూరు: రూ.కోట్ల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించిన వ్యవహరంలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు తాలుకా బమ్మా త్తకుళం గ్రామంలో చైన్నై కొడుంగైయూర్ ప్రాంతానికి చెందిన రీగన్పాల్కు రూ.కోట్ల విలువ చేసే 3.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2005లో అదే గ్రామానికి చెందిన హరిబాబు నుంచి కొనుగోలు చేసి, రెడ్హిల్స్ సబ్రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడంతో పాటు రెవెన్యూ నుంచి పట్టాను సైతం పొందారు. ఈ క్రమంలో రీగన్కు చెందిన భూమిని వేప్పేరికి చెందిన వేపా మురారీ, కమలశర్మ, సదాశివం, రామకృష్ణన్, జ్ఞానమూర్తి తదితరులు నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. విషయాన్ని గుర్తించిన బాధితులు 2006లోనే పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో వివాదం పెండింగ్లో ఉన్న క్రమంలో సంబంధిత భూమిని రామకృష్ణన్, జ్ఞానమూర్తి తదితరులు వేరే వ్యక్తులకు విక్రయించి పరారయ్యా రు. వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన క్రమంలో ఇద్దరిని పట్టుకోవడానికి ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, గాలించారు. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న రామకృష్ణన్, జ్ఞానమూర్తిని డీసీబీ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.