
పీటీ, పీజీ టీచర్ల సంఘం నూతన జిల్లా కమిటీ
పళ్లిపట్టు: తమిళనాడు, పీఈటీ, పీజీ టీచర్ల సంఘం జిల్లా కమిటీ నూతన నిర్వాహకుల ఎంపిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా నుంచి వంద మంది సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు సహా వివిధ పదవులకు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరగా జిల్లా అధ్యక్షుడిగా షేక్ గఫూర్, కార్యదర్శిగా దాస్, జిల్లా కోశాధికారిగా హరిబాబు తదితరులు ఎంపికయ్యారు. వారికి రాష్ట్ర కార్యదర్శి నరసింహన్ నియామక పత్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.