క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీస్తాం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీస్తాం

May 7 2025 1:05 AM | Updated on May 7 2025 1:05 AM

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీస్తాం

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీస్తాం

తిరువళ్లూరు: జిల్లా స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికితీస్తామని రాష్ట్ర మంత్రి నాజర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్‌ టాలెంట్‌ అండ్‌ రికగ్నైజేషన్‌ పేరిట ప్రత్యేక అకాడమీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్టార్‌ అకాడమీ పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సోమవారం సాయంత్రం డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించే కార్యక్రమం నిర్వహించారు. తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి నాజర్‌, కలెక్టర్‌ ప్రతాప్‌, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్‌, తిరుత్తణి చంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా మల్లయుద్ధం శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి నాజర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి నాజర్‌ మాట్లాడుతూ క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాతే క్రీడలకు ప్రాధాన్యం, నిధులు పెరిగాయని తెలిపారు. ప్రతి జిల్లాలోని 20 మంది క్రీడాకారులను గుర్తించి వారికి నెల రోజులపాటు శిక్షణ, వసతి, ఆహారం తదితర సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ జట్లకు సిఫారసు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంకే నేతలు పొన్‌పాండ్యన్‌, జైకృష్ణ, ప్రభాకరన్‌, ఽఅధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement