వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురి మృతి

May 7 2025 1:04 AM | Updated on May 7 2025 1:04 AM

వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురి మృతి

వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురి మృతి

తిరువళ్లూరు: సరదాగా ఈత కోసం వెళ్లిన ఆంధ్ర బాలుడి సహా ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్‌ తిరుకండలం గ్రామానికి చెందిన డ్రైవర్‌ సురేష్‌. ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు హరీష్‌(17) గురువాయల్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌–2 చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో హరీష్‌, వరుసకు తమ్ముడయ్యే ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా వైకుంఠాపురం సమీపంలోని కావలి గ్రామానికి చెందిన వెంకటేష్‌(14)తో కలిసి తిరుకండలం గ్రామానికి సమీపంలోని కుశస్థలీలో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటూ శ్రమించి మృతదేహాలను వెలికి తీసి శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కృష్ణాకాలువలో పడి అక్కచెల్లి మృతి..

కృష్ణాకాలువలో పడిన చిన్నారిని కాపాడబోయిన తల్లి, ఆమె సోదరి నీటిలో కొట్టుకపోయి మృతి చెందిన ఘటన ఆవడి సమీపంలో విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా మోరై గ్రామానికి చెందిన చిన్నదురై, సుగుణ దంపతుల కుమారుడు సంతోష్‌(04). ఈ క్రమంలో సుగుణ బట్టలు ఉతకడానికి కృష్ణాకాలువకు తన సోదిరి అంజనతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న సమయంలో సంతోష్‌ ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన సుగుణ తన బిడ్డను కాపాడినా, ఆమె మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. సుగుణను కాపాడడానికి ఆమే సోదిరి అంజన యత్నించే క్రమంలో ఇద్దరూ సుమారు వందల అడుగుల మేరకు కొట్టుకపోయి నీటిలో మృతి చెందారు.

కుశస్థలి నదిలో గాలింపు చర్యలు

మృతుల్లో నెల్లూరు విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement