ప్రతిభ చాటిన కారుణ్య వర్సిటీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చాటిన కారుణ్య వర్సిటీ విద్యార్థులు

May 7 2025 1:04 AM | Updated on May 7 2025 1:04 AM

ప్రతిభ చాటిన కారుణ్య వర్సిటీ విద్యార్థులు

ప్రతిభ చాటిన కారుణ్య వర్సిటీ విద్యార్థులు

● రూ.10 లక్షల బహుమతి కై వసం

కొరుక్కుపేట: ప్రోస్థటిక్‌ ఆర్మ్‌ ఇన్నోవేషన్‌తో కారుణ్య విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందం బోయింగ్‌ బిల్డ్‌ 4.0 పోటీలో విజేతగా నిలిచింది. ప్రోస్థటిక్‌ ఆర్మ్‌ ఇన్నోవేషన్‌తో వినూత్న ఆవిష్కరణకు రూ.10 లక్షల విలువైన బహుమతిని గెలుచుకుంది. విజేత జట్టులో కారుణ్య వర్సిటీ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆశీష్‌ శామ్యూల్‌, ఆర్పిత్‌ చౌహాన్‌, వి.కార్తికేయన్‌ ఉన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 2077 జట్లు పాల్గొన్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో 7 అగ్రజట్లు పాల్గొనగా కారుణ్య జట్టు జాతీయ స్థాయి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా బోయింగ్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా ప్రెసిడెంట్‌ సలీల్‌ గుప్తేతోపాటు బోయింగ్‌ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌, యుఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మాజీ సీఈఓ డానా డీసీ పాల్గొని అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కారుణ్య వర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పాల్‌ దినకరన్‌ విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. తమ విశ్వవిద్యాలయం పరిశోధన , ఆవిష్కరణలకు కేంద్రంగా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement