
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,263 మంది స్వామివారిని దర్శించుకోగా 25,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ ట కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టి కె ట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందే వెళ్లిన వారిని అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.