కాలుష్య నివారణకు కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

కాలుష్య నివారణకు కఠిన చర్యలు

May 1 2025 1:56 AM | Updated on May 1 2025 1:56 AM

కాలుష

కాలుష్య నివారణకు కఠిన చర్యలు

● ఇకపై రూ. 5 లక్షల వరకు జరిమాన ● చైన్నె కార్పొరేషన్‌ సమావేశంలో తీర్మానం

సాక్షి, చైన్నె: నగరంలో కాలుష్య నివారణకు విస్తృత చర్యలు చేపట్టామని మేయర్‌ ప్రియ తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణ వ్యర్థాలను నిర్వమించే వారు లేదా ఎక్కడ బడితే అక్కడకు తీసుకెళ్లి పడేసే వారికి ఇక రూ. 5 లక్షల వరకు జరీమాన విధించడం జరుగుతుందని ప్రకటించారు. బుధవారం రిప్పన్‌ బిల్డింగ్‌లో చైన్నె కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశం జరిగింది. మేయర్‌ ప్రియ, డిప్యూటీమేయర్‌ మహేశ్‌కుమార్‌, కమిషనర్‌ కుమర కురుబరన్‌లతో పాటుగా సభ్యులు,అ ధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో 237 తీర్మానాలను ఆమోదించారు. చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో భవన నిర్మాణాల కూల్చివేత, శిథిలాలు, వ్యరాథలను సురక్షితంగా తరలించకుండా ఇక్కడ బడితే అక్కడ పడేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కొరడా ఝుళిపించేందుకు నిర్ణయించారు. ఢిల్లీ, ముంబయి వంటి నగరాలలో అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తూ ఇక మీదట రూ. 5 లక్షల వరకు జరీమాన విధించేందుకు నిర్ణయించారు. విరుగంబాక్కం, ఓట్టేరిలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేచకుండా కెనల్‌ పునర్‌ నిర్మాణకు చర్యలు చేపట్టారు. వర్షపు నీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో తరలించేందుకు వీలుగా పరిశీలనకు హైడ్రోలాజికల్‌ నిపుణుడిని నియమించేందుకు నిర్ణయించి, వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను తయారీతో పాటూ ఇతర పనులకు రూ. 95 కోట్లు కేటాయించారు.

చైన్నె బీచ్‌ – వేలచ్చేరి మధ్య అదనంగా 20 రైళ్లు

కొత్త షెడ్యూల్‌ సిద్దం

కొరుక్కుపేట: చైన్నె బీచ్‌ – వేలచ్చేరి మద్య అదనంగా 20 రైళ్లను నడిపేందుకు కొత్త షెడ్యుల్‌ విడుదల కానుంది. ఇప్పటికే చైన్నె బీచ్‌ – తాంబరం – చెంగల్పట్టు మధ్య ఏసీ ఎలక్ట్రిక్‌ రైలు సర్వీసు ఈనెల 19న ప్రారంభించారు. ఈ రైలు టైమ్‌ టేబుల్‌ను తాజాగా ప్రచురించారు. రైళ్ల షెడ్యూల్‌ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందా లేదా అనే అంశంపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 600 మందికి పైగా తమ వ్యాఖ్యాలను పోస్టు చేశారు. ఈమేరకు టైమ్‌ మార్పులు ఇలా ఉన్నాయి. ఇందులో తాంబరంలో ఉదయం 6.50 గంటలకు బయలుదేరి ఉదయం 7.35 గంటలకు చెంగలప్పట్టు చేరుకుంటుంది. చెంగల్‌పట్టులో ఉదయం 7.50కి బయలుదేరి ఉదయం 9.25కి చైన్నె బీచ్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. ఉదయం 9.41 గంటలకు బీచ్‌లో బయలుదేరి ఉదయం 10.36 గంటలకు తాంబరం చేరుకుంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బీచ్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు చెంగల్‌పట్టు చేరుకుంటుంది. సాయంత్రం 4.30 గంటల చెంగల్‌ పట్టులో బయలేదురి సాయంత్రం 5 గంటలకు తాంబరం చేరుతుంది. సాయంత్రం 6.17 గంటలకు బీచ్‌లో బయలుదేరి రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 8:10 గంటలకు చెంగల్‌పట్టులో బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాంబరం చేరుకుంటున్నట్టు అధికారుల వెల్లడించారు.

ఆస్పత్రిలో అజిత్‌

తమిళసినిమా: నటుడు అజిత్‌ బుధవారం చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందన్న ఆందోళన సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ వ్యక్తం అవుతోంది. సినిమా, కార్‌ రేస్‌, రైపిల్‌ షూట్‌ ఇవి మినహా మరో విషయంపై దృష్టి పెట్టని స్టార్‌ నటుడు అజిత్‌. ఆయన సినిమా కార్యక్రమాలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటారు. ఈయన తాజాగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో అజిత్‌ సినీ, క్రీడా సేవలకు గానూ క్రేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడానికి నటుడు అజిత్‌ కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. కాగా పద్మభూషణ్‌ అవార్డును అందుకుని మంగళవారం రాత్రి చైన్నెకి తిరిగి వచ్చారు. అలాంటిది బుధవారం మధ్యాహ్నం అనూహ్యంగా అజిత్‌ చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా సోమవారం రాత్రి డిల్లీ నుంచి చైన్నె వచ్చిన అజిత్‌ను విమానాశ్రయంలో మీడియా సభ్యులు చుట్టు ముట్టారు. ఆ సందర్భంలో ఏర్పడ్డ తోపులాటలో ఆయన కాలుకి దెబ్బ తగిలినట్లు సమాచారం. దీంతో ఆస్పతిలో చేరిన అజిత్‌కు వైద్యులు ఫిజియోథెరఫీ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వైద్యుల నుంచి వెలువడాల్సి ఉంది.

కాలుష్య నివారణకు  కఠిన చర్యలు 
1
1/1

కాలుష్య నివారణకు కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement