సాక్షి, చైన్నె : తమిళ ప్రజలను, తమిళనాడును హేళన చేస్తే సహించబోమనికేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధిహెచ్చరించారు. చైన్నెలోజరిగిన ఓ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీఎంకేను టార్గెట్ చేశారు. డైవర్షన్ రాజకీయాలను డీఎంకే చేస్తున్నట్టు మండిపడ్డారు. స్వలాభం కోసం, రాజకీయ ఆదాయం కోసం ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్గాంధీ ఏమో జనాభా ఆధారంగా పునర్విభజన అంటూ ప్రచారం చేస్తుంటే, వారితో కలిసిఅడుగులువేస్తున్న డీఎంకే ఏమో మరోబాటను అనుసరించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కర్ణాటక డిప్యూటీ సీఎంను కావేరి నీళ్ల కోసం, కేరళ సీఎంను ముల్లైపెరియార్ డ్యాం విషయం గురించి నిలదీయకుండా కొత్త నాటకాలను ఆడుతున్నారని విమర్శించారు. విద్యార్థులతో చెలాగటం, తమిళ ప్రజలమనోభావాలను అడ్డుం పెట్టుకుని రాజకీయ ఆదాయం అంటూ డీఎంకే ఆడుతున్న నాటాకానికి తెర దించే సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా కనిమొళి ఆదివారం స్పందించారు.తమిళనాడు, తమిళ ప్రజలను కించ పరిచే విదంగా , హేళన చేసే రీతిలో వ్యాఖ్యలుచేస్తే సహించబోమని హెచ్చరించారు. తమిళ ప్రజల హక్కు కోసం తాము పోరాడుతున్నామన్నారు. తమిళనాడు ప్రజలు మరో మారు త్వరలో కేంద్రానికి గుణపాఠం చెప్పబోతున్నారన్న విషయాన్ని గుర్తెరిగితే మంచిదని హితవు పలికారు. తమిళనాడుకు తీవ్ర అన్యాయం తలబెట్టింది కాకుండా, కొత్త నాటకాలు ఆడుతున్నదెవరో అందరికీ తెలుసని ప్రశ్నించారు.