23న ప్రభుత్వ ఉద్యోగుల దీక్ష | - | Sakshi
Sakshi News home page

23న ప్రభుత్వ ఉద్యోగుల దీక్ష

Mar 21 2025 2:05 AM | Updated on Mar 21 2025 2:00 AM

సాక్షి, చైన్నె: తమ డిమాండ్ల సాధన నినాదంతో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు జాక్టో – జియో వేదికగా ఈనెల 23న నిరాహర దీక్షకు నిర్ణయించాయి. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులు సమ్మె గంట మోగిస్తామన్న హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. వీరితో మంత్రులతో కూడిన కమిటీ జరిపిన చర్చలు ఫలించ లేదు. బుధవారం ఒకరోజు విధులను బహిష్కరించి ఆందోళనకు సైతం దిగారు. విధులకు రాని వారిని గుర్తించి ఒక రోజు వేతనం కోతకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యాయి. ఈ నిరసనలతో నైనా పాలకులు స్పందిస్తే సరి లేని పక్షంలో సమ్మే గంట మోగించే దిశగా కార్యాచరణలో ఉన్నాయి.

చైన్నె వేదికగా బిజ్‌ ఫెయిర్‌ 2025

సాక్షి, చైన్నె : చైన్నె వేదికగా బిజ్‌ ఫెయిర్‌ 2025 ఎక్స్‌పోకు ఏర్పాట్లు చేశారు. ప్రిమియర్‌ బిజినెస్‌ నెట్‌ వర్కింగ్‌ మహోత్సవం నినాదంతో ఈనెల 22,23 తేదీలలో తేనాంపేట రీజియన్సీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఎక్స్‌పో జరగనుంది. ఇందులో 80కు పైగా పవర్‌ ప్యాక్డ్‌ స్టాల్స్‌ కొలువు దీర్చనున్నారు. వీటిలో విభిన్న శ్రేణి ఉత్పత్తులను, వివిధ సేవలను కొలువు దీర్చనున్నారు. ఇందులో పాల్గొనే వారికి వివిధ లక్కీడిప్‌ల ద్వారా బహుమతులను సైతం అందించనున్నారు.

డ్రైవర్‌, కండక్టర్‌పోస్టుల భర్తీకి ఆదేశాలు

సాక్షి, చైన్నె: ప్రభుత్వ రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,274 డ్రైవర్‌ , కండెక్టర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం జారీ అయ్యాయి. ఈ పోస్టులకు గాను శుక్రవారం నుంచి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. చైన్నె సహా 8 జోన్ల పరిధిలోని 25 ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కుంభకోణంలో 756, సేలంలో 486, చైన్నెలో 364, నైల్లెలో 362 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగాఅన్నా గ్రామాభివృద్ధి పథకం మేరకు 2329 కుగ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1087 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీఎం గృహ నిర్మాణ పథకంమేరకు 25 వేల గృహాల నిర్మాణానికిరూ. 600 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, మహిళలకు సురక్షిత ప్రయాణం కల్పించే విధంగా ప్రవేశ పెట్టిన పింక్‌ ఆటో పథకానికి గాను అర్హులైన మహిళా డ్రైవర్లు దరఖాస్తులు చేసుకోవచ్చు అనిప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్‌డీపీఐ నేత ఇంట్లో ఈడీ సోదాలు

సాక్షి, చైన్నె: కోయంబత్తూరులోని ఎస్‌డీపీఐ నేత ఇంట్లో గురువారం ఈడీసోదాలు జరిగాయి. కోయబబత్తూరు మేట్టు పాళయం అన్నాజీ రావ్‌ నగర్‌కు చెందిన రజాక్‌ అహ్మద్‌ ఎస్‌డీపీఐ పార్టీ కోయంబత్తూరు ఉత్తర జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పాత సామాన్ల దుకాణాలతో పాటుగా కార్ల విడి భాగాల అమ్మకాల దుకాణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయాన్నే ఒక మహిళా అధికారిణితో పాటుగా ఐదుగురు సిబ్బందితో ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. సీఆర్‌పీఎఫ్‌ భద్రతతో అక్కడికి ఈడీ అఽధికారులు వచ్చిన సమాచారంతో ఎస్‌డీపీఐ పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సోదాలు జరిగాయి. రజాక్‌ వద్ద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినానంతరం అధికారులు వెనుదిరిగారు.

విద్యారాణికి ఎన్‌టీకేలో పదవి

సాక్షి, చైన్నె : వీరప్పన్‌ కుమార్తె విద్యారాణికి నామ్‌ తమిళర్‌ కట్చిలో పదవి దక్కింది. ఆమెకు యువజన పాసరై కన్వీనర్‌ పదవిని అప్పగించేందుకు ఆ పార్టీ నేత సీమాన్‌ నిర్ణయించారు. చందనపు స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది వరకు బీజేపీలో కొంత కాలం పనిచేశారు. తర్వాత సామాజిక సేవ అంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం నామ్‌ తమిళర్‌ కట్చిలో ఆమె చేరారు. పార్టీలో చురుగ్గా రాణిస్తున్న ఆమెకు యువజన విభాగం పాసరై కన్వీనర్‌ పదవిని సీమాన్‌ అప్పగించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

23న ప్రభుత్వ ఉద్యోగుల దీక్ష 
1
1/1

23న ప్రభుత్వ ఉద్యోగుల దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement