కొరుక్కుపేట: ప్రజలు నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను నగర పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల శిబిరంలో ప్రజల నుంచి 26 అర్జీలు అందాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 26 మంది ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు కమిషనర్ అరుణ్ వారిలో భరోసాను కల్పించారు. ఈక్రమంలో ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ( గార్డియన్ వెల్ఫేర్ అండ్ ఎస్టేట్ ) ఎస్ మగళిన్ జడాన్ పాల్గొన్నారు.