సేలం: సేలం సమీపంలో తండ్రి మరణించిన దుఃఖంతోనే ఓ విద్యార్థి ప్లస్– 2 పరీక్షకు హాజరయ్యాడు. అలాగే తంజావూరు సమీపంలో తన తల్లి మృతి విషయాన్ని తట్టుకుని ఓ కుమార్తె పరీక్షకు వెళ్లింది. వివరాలు..సేలం – సేలం సమీపంలోని అచ్చంకుట్టపట్టి సెంకరాడు ప్రాంతంలో నివసించే గణేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు సరోజ, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మణికంఠన్ సుక్కంపట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. పన్నెండవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నందున, మంగళవారం చరిత్ర సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఈ పరిస్థితిలో, తండ్రి గణేషన్ సోమవారం సాయంత్రం అనారోగ్య కారణాల వల్ల మరణించారు. తండ్రి మరణంతో కలిగే బాధను పక్కన పెడితే, తన తండ్రి కోరికను తీర్చడానికి పబ్లిక్ పరీక్షకు సిద్ధమవుతూ వలసయూర్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో మణికంఠన్ పరీక్ష రాశాడు.
తంజావూరులో..
తంజావూరు జిల్లా పట్టుకోట సమీపంలోని వెట్టువాంకోట్టై గ్రామం, రామాపురానికి చెందిన రాజేంద్రన్ భార్య కలా. వీరి మూడవ కుమార్తె కావ్య (17) ఊరనిపురం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్ –2 చదువుతోంది. ఈ స్థితిలో కలా మంగళవారం ఉదయం గుండె పోటు ఏర్పడి అకస్మాత్తుగా మృతి చెందింది. ఆ బాధతోనే వెళ్లి పరీక్షకు హాజరైంది.