● ఇద్దరి అరెస్ట్
● నైల్లెలో కలకలం
సేలం: నైల్లెలో రిటైర్డ్ ఎస్ఐని కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నైల్లె టౌన్ తడివీరన్ ఆలయ వీధికి చెందిన జాకీర్ హుస్సేన్ బిజిలి (57). ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతని కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా జాకీర్ హుసేన్ చైన్నె పోలీసు శాఖలో ఎస్ఐగా విధులు నిర్వహించి వీఆర్సీ తీసుకున్నారు. ఈయన నెల్లై టౌన్ మూర్తిమ్ జైక్కాన్ తైక్కా నిర్వాహకుడిగా ఉంటున్నాడు. ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం పాటిస్తున్న స్థితిలో మంగళవారం వేకువజామున తైక్కాకు నమాస్ చేయడానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని దక్షిణ మౌంట్రోడ్డులో నడిచి వెళుతుండగా ముగ్గురు యువకులు బైక్లో అతన్ని వెంబడించి కత్తులో దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణన్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా సమాచారం అందుకుని నెల్లై నగర వెస్ట్ మండల డిప్యూటీ పోలీసు కమిషనర్ గీత, టౌన్ డిప్యూటీ కమిషనర్ అజిత్కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మృతదేహంగా జాకీర్ హుసేన్ బిజిలి కనిపించాడు. అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టౌన్ కాట్చి మండపం సమీపంలో తొట్టిపాళం వీధి సమీపంలో ప్రధాన సాలైలో 36 సెంట్ల భూమి ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి జాకీర్ ఊసేన్ బిజిలికి అదే ప్రాంతానికి చెందిన ఇస్లామ్ మహిళను వివాహం చేసుకున్న విషయంగా పట్టియల్ వర్గానికి చెందిన వ్యక్తితో గొడవలు ఉన్నట్టు తెలిసింది. అది తీవ్ర స్థాయికి చేరుకున్న స్థితిలో జనవరిలో జాకీర్ హుస్సేన్ బిజిలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిటైర్డ్ ఎస్ఐ దారుణ హత్య