తమిళసినిమా: విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఈ చిత్రం సమీప కాలంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఏస్ ఒకటి. దర్శకుడు ఆరుముగ కుమార్ స్వీయ దర్శకత్వంలో తన 7సి ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇది .నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, పీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజకుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ బహుదూర్ రావత్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శన నిర్మాత ఆరుముగ కుమార్ తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న కథా చిత్రమని చెప్పారు. చిత్ర షూటింగ్ మొత్తాన్ని మలేషియాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు.చిత్ర టైటిల్ను, టీజర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఏస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. కాగా తాజాగా చిత్రంలోని సింగిల్ సాంగ్ వీడియోలు చేసినట్లు చెప్పారు గాయని శ్రేయ ఘోషల్, గాయకుడు కపిల్ కపిలన్ పాడిన ఈ మెలోడీ సాంగ్ సంగీత పేరు నుంచి స్పందన వస్తోందని, చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సలహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మహారాజా వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న ఏస్ చిత్రంపై విజయ్ సేతుపతి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. దీని తర్వాత విజయ్ సేతుపతి నటిస్తున్న ట్రైన్ చిత్రం కూడా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.