● రెండున్నర నెలల్లో 1.18 లక్షల మందికి కుక్కకాట్లు ● ర్యాబిస్ సోకి నలుగురి మృతి ● మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా ● చైన్నె కార్పొరేషన్ వెల్లడి
సేలం: ఇటీవల కాలంగా రాష్ట్రంలో శునకాల స్వైర వివారం చేస్తున్నాయి. రోడ్డు మీద వెళ్ల లేని పరిస్థితి అనేక చోట్ల ఉన్నాయి. పిల్లలు, ఒంటిరిగా వెళ్లే వారిని, ద్విచక్ర వాహనాలలో పయనించే వారిని శునకాలు వెంటాడుతున్నాయి. దాడులు చేస్తున్నా యి. ఇందులో కొందరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రులలో చేరుతున్నారు. గత రెండున్నర నెలల్లో రాష్ట్రంలో 1.18 లక్షలకు పైగా ప్రజలు కుక్కకాటుకు గురయ్యారు. వీరిలో రేబిస్ వ్యాధి సోకి నలుగురు మృతి చెందారు. తమిళనాడులో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు కాటు వేయడం వల్ల గాయాలయ్యే సంఘటనలు పెరుగుతుండటం కలరం రేపుతున్నది. దీంతో పెంపుడు జంతువులకు, వాటిని పెంచే వారికి రేబిస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి టీకాలు వేయడం ఒక పరిష్కారంగా మారింది. పుట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో కుక్కపిల్లకి రెండుసార్లు రాబిస్ టీకాలు వేయించాలి. సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయడం కొనసాగించాలి. అయితే, వీధి కుక్కలకు, కొన్ని చోట్ల పెంపుడు జంతువులకు సరైన టీకాలు వేయడం లేదు. దీంతో కుక్కకాటుకు గురయ్యే వారు రేబిస్ బారిన పడుతున్నారు. గత సంవత్సరం రూ. 4.80 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. అత్యధికంగా అరి యలూర్లో 37,023, కడలూరులో 23,997, ఈరోడ్లో 21,507 మంది, చైన్నెలో 24,088 మందికి ర్యాబిస్ సోకింది. సకాలంలో టీకాలు వేయకపోవడంతో నలుగురు రేబిస్ వ్యాధితో మరణించారు. ఈ సంవత్సరం కేవలం రెండున్నర నెలల్లో, లక్షా 18 వేల 764 మంది కుక్క కాటుకు గురయ్యారు. రేబిస్ వ్యాధితో నలుగురు మరణించగా, కన్యాకుమారిలో ఇద్దరు, రాణిపేట, నామక్కల్లలో తలా ఒకరి చొప్పున మరణించారు.
టీకాలు తప్పనిసరి..
దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సెల్వవినాయగం మాట్లాడుతూ.. తమిళనాడులో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అందరికీ రేబిస్ రాదు. కుక్క, పిల్లి, మేక, ఆవు, గుర్రం, కోతి, నక్క, ఉడుము, తోడేలు లేదా గబ్బిలం వంటి జంతువులు కరిచినప్పుడు రేబిస్ టీకాలు వేయడం అవసరం. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లక్షకు పైగా వ్యాక్సిన్లు స్టాక్లో ఉన్నాయి. కుక్కలు వంటి జంతువులు కరిచినట్లయితే, వాటికి మొదటి రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 28వ రోజున నాలుగు డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. గాయం లోతుగా ఉంటే, అదనపు ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల కొంతమంది రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారు. కాబట్టి, ఏదైనా జంతువు కాటు వేస్తే, వైద్యుల సలహా మేరకు మీరు సరిగ్గా టీకాలు వేయించుకోవాలి అనిలీసందర్భంగా ఆయన వెల్లడించారు. కాగా పెంపుడు కుక్కలను రోడ్లపై తీసుకెళ్లే సమయంలో మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా తప్పదని కార్పొరేషన్ అధికారులు ఈసందర్భంగా ప్రకటించారు.