తమిళసినిమా: కోలీవుడ్లో పన్నీర్ పుష్పంగల్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు సురేష్. 1981లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈయన పన్నీర్ పుష్పంగల్ సురేష్గా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సురేష్ తమిళంతో పాటూ తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వైవిధ్య భరిత కథా పాత్రల్లో నటిస్తున్న సురేష్ పలు టీవీ సీరియల్ లోను నటించారు. కాగా 61 ఏళ్ల ఈయన తాజాగా మరోసారి ప్రధాన పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి విజయశ్రీ జి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ఈయన 87 ఏళ్ల చారుహాసన్ ప్రధాన పాత్రలో దాదా 87 అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఆ తర్వాత సినీ పీఆర్ఓ నిఖిల్ మురుగన్ను కథానాయకుడిగా పరిచయం చేసి పౌడర్ అనే చిత్రాన్ని, మరో సీనియర్ నటుడు మోహన్ కథానాయకుడిగా హర అనే చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకున్నారు. తాజాగా 61 ఏళ్ల నటుడు సురేష్ ప్రధాన పాత్రలో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మలేషియాకు చెందిన దత్తో గణేష్ ప్రసాద్ జీవి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో మలేషియా రజనీకాంత్ అలియాస్ దత్తో గణేష్, అనిత్ర నాయర్, దీప, మొట్టై రాజేంద్రన్, సింగం పులి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. చిత్ర షూటింగులు మలేషియా, ఇండియాలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్ర టైటిల్ను టీజర్ను ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా 61 ఏళ్ల సురేష్ మళ్లీ ప్రధాన పాత్రను పోషించనుండడంతో ఈ చిత్రంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
సురేష్తో దర్శకుడు విజయశ్రీ జీ