టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Mar 19 2025 12:34 AM | Updated on Mar 19 2025 12:33 AM

సాక్షి, చైన్నె: డ్రీమ్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. టెన్నిస్‌ లెజెండ్‌ శరత్‌ కమల్‌, డ్రీమ్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సీనియర్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ఫెర్నాండెజ్‌, దీపక్‌ మాలిక్‌ ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం అనలిటిక్స్‌ ఓరియెంటేషన్‌ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. యువ అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తేజకరమైన పోటీకి వేదికను ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు అండర్‌–15 బాలుర విభాగంలో కె.అక్షయ్‌భూష్‌, చక్రవర్తి శ్రేష్ట అద్భుత ప్రదర్శనను ఇచ్చారు. బాలికల విభాగంలోశ్రేయ,జత్నాదఉంజిత్‌ ఆధిపత్యం చూపించారు.

భవిష్యత్‌ ప్రకాశవంతం: ప్రేమలత

సాక్షి, చైన్నె : 2026 రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ప్రకాశవంతమైన సంవత్సరంగా డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్‌ వ్యాఖ్యానించారు. ప్రేమలత విజయకాంత్‌ జన్మదినం సందర్భంగా మంగళవారం విరుగంబాక్కంలో డీఎండీకే నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. పలు చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రేమలతకు ఆమె కుమారుడు విజయప్రభాకరన్‌ కేక్‌ తినిపించి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సోదరుడు, పార్టీ నేత సుదీష్‌ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈసందర్భంగాప్రేమలత విజయకాంత్‌ మాట్లాడుతూ, తాను ఎప్పడు బర్తడేలు చేసుకోలేదన్నారు. విజయకాంత్‌ అందర్నీ వీడినానంతరం తాను ఎలాంటి వేడుకలు చేసుకోవడం లేదని, హాజరు కావడం లేదన్నారు. డీఎండీకే వర్గాల విజ్ఞప్తి మేరకు తాను ఇక్కడకు వచ్చినట్టు పేర్కొంటూ, 2026 ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రకాశవంతంగా మలిచే సంవత్సరంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రేమలత విజయకాంత్‌కు సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపించారు.

తమిళం తప్పనిసరి

– సీఎం రంగన్న స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని అన్ని దుకాణాలు, వర్తక వాణిజ్య సముదాయాలు, మాల్స్‌అంటూ అన్నింటా తమిళ బోర్డులను తప్పని సరి చేశారు. అసెంబ్లీ వేదికగా మంగళవా రం సీఎంరంగస్వామి ప్రకటించారు. ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు వంటి వ్యవహారాలన్నీ తమిళంలోనే జరగాలని ఆదేశించారు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఉదయం స్వతంత్ర ఎమ్మెల్యే నెహ్రు ప్రసంగిస్తూ మాతృ భాష పరిరక్షణ గురించి వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలు వారి వారి మాతృ భాషకు పెద్ద పీట వేస్తున్నాయని, పరి రక్షించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణల తో ముందుకెళ్తున్నాయని వివరించాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ భాషా ను పరి రక్షించుకునేందుకు పాలకులు తీవ్ర పోరాటం మొదలెట్టి ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం తమిళ భాష పరిరక్షించ బడాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సీఎం రంగస్వామి సమాధానం ఇస్తూ, అన్ని వర్తక వాణిజ్య సముదాయాలు, దుకాణాలలో త మిళంలోనే బోర్డులు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్వవహారాలు, ఆహ్వానాలు తదితర అంశాలలోనూ తమిళం తప్పనిసరి అని స్పష్టంచేశారు. అన్నింటా తమిళం ముద్రించ బడాలని, తమిళం వికసించే విధంగా బోర్డులు కనిపించాలని ఆదేశించారు.

లంక సేనల దాష్టీకం

– ముగ్గురు జాలర్ల అరెస్టు

సేలం : కచ్చతీవు సమీపంలో చేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళం రామేశ్వరానికి చెందిన ముగ్గు రు జాలర్లను అదుపులోకి తీసుకుని వారి పడవలను స్వాధీనం చేసుకుంది. సరిహద్దు దాటి చేపలు పడుతున్నారనే ఆరోపణలతో శ్రీలంక నావికాదళం తమిళనాడు జాలర్లను నిర్బంధిస్తూనే ఉంది. దీనిని ఆపాలని మత్స్యకారులు, తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతున్నాయి. అయితే, తమిళనాడు మత్స్యకారుల అరెస్టు కొనసాగుతోంది. రామేశ్వరం ప్రాంతానికి చెందిన జాలర్లు మంగళవారం తెల్లవారుజామున లోతైన సముద్రంలో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో, సరిహద్దు దాటి చేపలు పట్టారనే ఆరోపణల తో 3 మంది మత్స్యకారులను వారి ఫిషింగ్‌ బోట్‌ తో సహా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మత్స్యకారులను శ్రీలంక నావికాదళం కాంగేశం క్యాంప్‌కు తరలించారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెంటనే జాలర్లను విడిపించే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జయ శంకర్‌కు లేఖను రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement