కొరుక్కుపేట: హత్యాయత్నం కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులకు నాలుగు సంవత్సరాలు శిక్షపడేలా చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బ్యాంక్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఎన్ కన్నన్పై ప్రసంశలు కురిపించారు. సోమవారం నేరుగా చైన్నె నగర పోలీసు కమీషనర్ అరుణ్ తన కార్యాలయానికి ఆహ్వానించి ఎన్.కన్నన్ సేవలను ప్రశంసిస్తూ రివార్డుతో అభినందించారు. వివరాలు.. చైన్నె టి.నగర్కు చెందిన అల్లి – అయ్యనార్లు టినగర్ నార్త్ ఉస్మాన్ రోడ్డులోని ఫుట్పాత్పై షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో 2023 సంవత్సరం మే1వ తేదీన వెంకటేశన్తోపాటూ మరో ముగ్గురు వ్యక్తులు అక్కడి వచ్చి అల్లి అనే మహిళను మీభర్త ఎక్కడ అని అగిడి గొడవకు దిగారు. వారిమధ్య వాగ్వాదం జరిగి పక్కకు నెట్టి వేశారు. ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ నలుగురు వ్యక్తులు షాపులోని సరుకులు పగులగొట్టి అల్లి నుంచి రూ.1,000 తీసుకుని ఆటోలో పరారయ్యారు. పై ఘటనపై అల్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, హత్యాయత్నం సహా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులు వెంకటేశన్,వినోద్ శ్రీనివాసన్, మణివన్ అనే నలుగురిని కన్నన్ నేతృత్వంలోని పోలీసు బృందం అరెస్టు చేసింది. విచారణ అనంతరం నలుగురు దోషులకు ఒక్కొక్కరికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ 14.03.2025 న కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసు కమిషనర్ అరుణ్ స్వయంగా కన్నన్ను ఆహ్వానించి అభినందించారు.