● రంగన్న ● పుదుచ్చేరి సభలో రచ్చ ● టేబుల్ మీదకు ఎక్కిన మహిళా ఎమ్మెల్యే
సాక్షి, చైన్నె :పుదుచ్చేరిలో దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రంగస్వామి స్పష్టంచేశారు. కాగా సభలో ఓ వివాదం సమయంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక తన కుర్చీ నుంచి లేచి, దాని మీద నిలబడి నినాదాలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర పాలిత ప్రాంతంపుదుచ్చేరిలో అసెంబ్లీ సమావేశాలు 10వ తేదీ నుంచి జరుగుతున్నవిషయం తెలిసిందే. 12వ తేదీ సభలో సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేశారు. బడ్జెట్పై సభలో చర్చ జరుగుతోంది. సోమవారం సభ ప్రారంభం కాగానే, డీఎంకే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. ఎన్నికల వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదనిధ్వజమెత్తారు.అ న్నింటా ఈపాలకులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తమ నేత కలైంజ్ఞర్ విగ్రహంతో కూడిన స్మారక మందిరం పనులు కూడా ఇంత వరకు చేపట్ట లేదని నిలదీశారు. దీంతో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ ఎమ్మెల్యేలు, డీఎంకే – కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ నుంచి ప్రతి పక్షాలు వాకౌట్ చేశాయి. ఈ సమయంలో సభలో సాగుతున్న వివాదంనేపథ్యంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రప్రియాంక ఆగ్రహంతో తన సీటు నుంచి లేచ్చారు. తన కూర్చీపైకి ఎక్కేసి నిలబడి ఏదో మాట్లాడుతూ తన నిరసనను వ్యక్తంచేసే విధంగా ముందుకెళ్లారు. దీంతో ఆమెను స్పీకర్ ఎన్బలంసెల్వం వారించారు. అనంతరం సీఎం రంగస్వామిమాట్లాడుతూ కలైంజ్ఞర్ కరుణానిధి అంటే అందరికీ గౌరవం అని, తమిళంకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని, రాజకీయాలలో గొప్ప నేతల అని కొనియాడుతూ ఆయనకు పుదుచ్చేరిలో విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఇదిత్వరలో జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు.