పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపం అత్తిమాంజేరిపేటలో సీఎం స్టాలిన్ 72వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం డీఎంకే ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకున్నారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎంకే నేత విభాగం ఉప కార్యదర్శి రామచంద్రన్ అధ్యక్షతన చేపట్టిన వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 500 మందికి బిరియానీ పంపిణీ చేశారు. ఇందులో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బిరియానీ పోటాపోటీ పడ్డారు. డీఎంకే జిల్లా వర్తక విభాగం ఉప కార్యదర్శి కదిరవన్, మండల నాయకులు అన్బళగన్, గురునాథన్, జయవేలు, రాజేంద్రనాయుడు, రామస్వామి, శేఖర్ పాల్గొన్నారు.