
మూగజీవుల లెక్కింపు పనులు షురూ
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లాలో వ్యవసాయం, పశు పోషణ ప్రజల ప్రధాన జీవనాధారంగా వుంది. జిల్లాలోని తిరువళ్లూరు, తిరుత్తణి, పొన్నేరి, అంబత్తూరు డివిజన్లలో 21వ మూగజీవుల లెక్కింపు గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. మూగజీవుల లెక్కింపు పనుల్లో 45 మంది అధికారుల సమక్షంలో 210 మంది మూగజీవుల లెక్కింపు పనులు చేపట్టారు. జిల్లాలో 6, 47,838 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు చేపట్టారు. మిగిలిన 1,01,905 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో మూగజీవుల లెక్కింపు పనుల్లో సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ నవనీతకృష్ణన్ జిల్లాలో మూగజీవుల లెక్కింపు పనులను ఆదివారం తనిఖీ చేశారుపశుసంవర్థక శాఖ మండల అదనపు డైరెక్టర్ జయంతి, ఉప డైరెక్టర్ శీనివేలన్, సహాయ డైరెక్టర్లు దామోదరన్, అనిత, పశుసంవర్థక శాఖ వైద్యులు, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.