● సినీ పక్కీలో ఛేజింగ్ ● కొలనులో దూకడంతో పట్టుబడిన వైనం
సేలం: కోవై జిల్లా పెరూర్ సమీపంలో ఆలన్తురై ప్రాంతానికి చెందిన రైతు కృష్ణసామి (62). ఈయన సర్టిఫికెట్ కోరుతూ మత్తువరాయపురం వీఏఓ వెట్రివేల్ (35)ను కలిశాడు. అప్పుడు వీఏఓ వెట్రివేల్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.5 వేలు లంచం అడిగాడు. దీంతో కృష్ణస్వామి రూ.1000 నగదును వెట్రివేల్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బును శుక్రవారం ఇస్తానని తెలిపాడు. దీంతో వీఏఓ కృష్ణస్వామిని పుట్టువిక్కి రోడ్డు వద్దకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలని తెలిపాడు. ఇదిలాఉండగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని కృష్ణస్వామి ఈ విషయాన్ని ఏసీబీ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ శాఖ అదనపు ఇన్స్పెక్టర్ దివ్య, పోలీసులు రసాయనంతో పూసిన నోట్లను అందజేశారు. ఆ నగదు నోట్లతో కృష్ణసామి వీఏఓను శుక్రవారం సాయంత్రం సుండక్కాపుత్తూర్ రోడ్డు వద్ద పుట్టువిక్కిర ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు వెట్రివేల్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులను చూసిన వెంటనే వీఏఓ బైక్పై తప్పించుకుని పారిపోయాడు. అయితే పోలీసులు సినీ పక్కీలో వీఏఓను వెంబడించారు. వీఏఓ పెరూర్ కులత్తేరి రోడ్డుపై బైక్ను నిలిపి పెరూర్ కొలనులో దూకేశాడు. లంచం డబ్బులను కూడా కొలనులో పడేశాడు. పోలీసులు వెట్రివేల్ను అరెస్టు చేశారు. అనంతరం కొలనులో వెట్రివేల్ వేసిన రూపాయి నోట్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం వీఏఓను వేట్రివేల్ను పెరూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ పోలీసులు తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు.