సాక్షి, చైన్నె: ప్రభుత్వ పాఠశాలల్లో అలైషిప్ క్లబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కార్పొరేట్ల కోసం ప్రపథమంగా మేల్ అలైషిప్ సినర్జీ సమ్మిట్ శనివారం నిర్వహించారు. సమ్మిళిత నాయకత్వం, సమానత్వం సాంస్కృతిక మేధస్సు ప్రధాన అంశాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశంలోని ప్రముఖ వర్క్ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థగా ఉన్న అవతార్ పరిధిలోని లాభాపేక్షలేని విభాగం అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్, ‘మేల్ అలై షిప్ సినర్జీ సమ్మిట్’(ఎంఏఎస్ఎస్) – 2025ను స్థానికంగా నిర్వహించింది, ఇది కార్పొరేట్ నిపుణులు , విద్యార్థుల మైత్రిని సాధించడానికి వేదికగా నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలలో కౌమారదశలో ఉన్న బాలుర సున్నితత్వంపై దృష్టి సారించే విధంగా మెన్ ఇంపాక్టింగ్ ట్రస్ట్ – రెస్పెక్ట్) ఆధారిత ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని నాలుగుప్రభుత్వ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అలైషిప్ క్లబ్లు ప్రారంభించారు. అలాగే, ‘అలైషిప్ను రోజువారీ చర్యలుగా మార్చడం’ అనే అంశంపై ప్యానెల్ చర్చ, ‘హార్ట్ టు ఆర్ట్’ – పోస్టర్ తయారీ పోటీ, కార్యాలయంలో అలైషిప్ ఉత్తమ పద్ధతులు, శక్తిపై వీడియో బైట్లు , మేల్ అలైషిప్ చుట్టూ కేంద్రీకృతమైన ఇతర పోటీలను ఈసందర్భంగా నిర్వహంచారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కూపర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మోహన్రామ్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక నాందికి ఈ క్లబ్లు దోహదకరంగా పేర్కొన్నారు. బాలురు, బాలికలను కలిపి మిత్రత్వాన్ని చురుకుగా అభ్యసించడానికి ప్రయత్నిస్తాయని వివరించారు. తమిళనాడు అంతటా 30 పాఠశాలల్లో తొలి విడతగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా క్లబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ , లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పురుషులు పోషించే కీలక పాత్ర గురించి, వారి సమ్మిళిత నాయకత్వాన్ని ఎలా ప్రోత్సహించవచ్చో, అవకాశాల కోసం ఎలా వాదించవచ్చో, మిత్రుడిగా ఎలా ఉండవచ్చో అన్న విషయాలను విద్యార్థులకు వివరించారు.