తమిళసినిమా: నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, సత్యరాజ్, నటి శృతిహాసన్, రెండా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా చిత్రం టైటిల్ వీడి యోతో పాటూ రెండు పాటల క్లిప్పింగ్స్ ను విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇది స్మగ్లింగ్ గ్యాంగ్స్ ఇతివృత్తంతో రూపొందుతున్న కథా చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం దర్శకుడు లోకేష్ కనకరాజ్ 49వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నటి శృతిహాసన్ ఎక్స్ మీడియా ద్వారా ఆయనకు జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. కాగా కూలీ చిత్రంలో నటుడు బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈయన పుట్టిన రోజు శుక్రవారం మే కావడంతో ఆయనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. అంతేకాకుండా కూలీ చిత్రంలో లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్తో ఉన్న ఫొటోను, నాగార్జునతో, ఉపేంద్ర, సత్యరాజ్తో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలిప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కూలీ చిత్రంపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయనే చెప్పాలి.
లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా..
లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా..