
మంచి నిద్రతో సంపూర్ణ ఆరోగ్యం
కొరుక్కుపేట: మంచి నిద్రతో సంపూర్ణ ఆర్యోగం లభిస్తుందని అపోలో ఆస్పత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్లీప్ హెల్త్ హెచ్ఓడీ డాక్టర్ కార్తీక్ మాదేశ్ అన్నారు. అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి – వానగరం ఆధ్వర్యంలో ప్రపంచ స్లీప్ డే 2025ను పురస్కరించుకుని స్థానిక వానగరం జంక్షన్ వద్ద నిద్రపై ప్రజల్లో అవగాహన పెంచారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున పాల్గొని తలదిండ్లను ప్రదర్శిస్తూ మానవహారంగా నిద్రపై అవగాహన కల్పించారు. డాక్టర్ కార్తీక్ మాదేశ్ మాట్లాడుతూ తక్కువగా నిద్ర పోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్య రుగ్మతలతో ముడిపడి ఉందని అన్నారు. మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. న్యూరాలజీ హెచ్ఓడీ , సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రభాష్ ప్రభాకరన్, అపోలో ఆస్పత్రి వానగరం వైద్యులు డాక్టర్ మోహనకృష్ణన్, డాక్టర్ రాహుల్ రాఘవ్ మీనన్, వానగరం, తిరువెర్కాడు మున్సిపాలిటీ చైర్మన్ మూర్తి పాల్గొన్నారు.