– ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవ ర్యాలీ
సాక్షి, చైన్నె: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక మిషన్ విశ్వవిద్యాలయం, చైన్నె ఆరుపడై వీడు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాంచీపురం క్యాంపస్లోని అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల, శ్రీ మెడికల్ ఫౌండేషన్, ఏకేజీ ఫెర్టిలిటీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ జరిగింది. మూత్రపిండాల ప్రాముఖ్యత, వాటి రక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఆ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ గణేషన్ మార్గదర్శకంలో డీన్ ప్రొఫెసర్ డాక్టర్ సెంథిల్కుమార్ పర్యవేక్షణలో ర్యాలీతోపాటుగా అవగాహన శిబిరం జరిగింది. గ్యా స్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నీలమేఘం, కిడ్నీ హెల్త్ ఇండియా ప్రతినిధులు, డాక్టర్ ప్రభు కాంచి, వాలంటీర్ ఆర్గనైజర్ శుభాశాంతిని పళనిస్వామి, చెంగల్పట్టు వైద్య కళాశాల నెఫ్రాలజీ విభాగంలో నిపుణుడు డాక్టర్ నాగరాజన్, మెడికల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శశికుమార్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వరి, డైరెక్టర్ శ్రీ ముత్తురాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు భాను, దినేష్ ,మెడికల్ ఫౌండేషన్కు చెందిన తౌఫిక్ అహ్మద్, కావ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలతో శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే, 2050 నాటికి జీరో డయాలసీస్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే రీతిలో అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించారు.