విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధి వంటి ఐదు అంశాలను మెరుగు పరిచేందుకు నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎం స్టాలిన్ కోరారు. దీనిని సమగ్రంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘానికి సూచించారు.
● ఐదు సామాజిక అంశాల్లో మెరుగుదలే కీలకం ● రాష్ట్ర ప్రణాళిక సంఘానికి సీఎం స్టాలిన్ సూచన
సాక్షి, చైన్నె: సచివాలయంలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం సమావేశం సాగింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈ సందర్భంగా ప్రణాళిక కమిషన్ వర్గాలు సీఎం స్టాలిన్కు అందజేశారు. అలాగే సీఎం అల్పాహార పథకం – ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై ప్రభావం గురించి తుది నివేదిక, 10– 12 తరగతి పబ్లిక్ పరీక్షల విధానాలపై అధ్యయనం, చైన్నె పరిసర ప్రాంతాలలో వలసదారులు– కార్మికుల జీవితంపై అధ్యయనం వంటి అంశాలపై పరిశోధన నివేదికలను సమర్పించారు. అనంతరం, రాష్ట్ర ప్రణాళిక కమిటీ తాత్కాలిక ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జె. జయరంజన్ బృందం కార్యకలాపాలు, గత సమావేశంలో ఆదేశాలు, నిర్ణయాలు, సిఫార్సుల అమలు గురించి సమీక్షించారు. అధ్యయనాలు, ఫలితాలు, మార్గదర్శకత్వం, ప్రాజెక్టులత్లో సాధారణ ప్రజలపై కలిగే ప్రభావాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ సమావేశంలో సీఎం విశదీకరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అమలు చేసిన ప్రత్యేక ప్రాజెక్టులు తమిళనాడు ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్, రిసోర్స్ఫుల్ సర్కిల్స్ వంటి ప్రాజెక్టు పనులపై ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాషా, జాతి వంటి అంశాల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై ఆధారపడ్డ అంశాలను గుర్తుచేశారు. తమిళనాడులోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది ప్రణాళిక, సమాంతర అభివృద్ధిని సాధించే లక్ష్యంతో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అందించిన వివిధ పరిశోధన నివేదికలు, విధాన ముసాయిదాలను ప్రస్తవిస్తూ, వాటిని విభాగాలు ప్రభుత్వ కార్యదర్శులు అమలు చేశారా లేదా, ఈ ప్రణాళికల సిఫార్సులను వారి విభాగాలలో సరిగ్గా అమలు చేయడానికి ఈ కమిటీ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధిని మెరుగు పరిచేందుకు నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికిమద్దతుగా నిలవాలని, సిఫార్సులే కాదు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ప్రణాళిక కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, తాత్కాలిక ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జె. జయరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ యాదవ్, ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఉదయచంద్రన్, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ రాముడు. శీనువాసన్, ప్రొఫెసర్ సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్, కె. దీనబంధు, శాసనసభ సభ్యుడు డాక్టర్ ఎలిలన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎలిగంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక నివేదికలోని అంశాలను జయరంజన్ వివరించారు.
బడ్జెట్కు వేళాయె!
మెట్రో అధికారులతో..
మెట్రో ప్రాజెక్టు అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. చైన్నెలో ఫేజ్–2 పనులు, కోవై, మదురై, తిరుచ్చి వంటి నగరాలమెట్రో రైలు ప్రాజెక్టుల అమలుకు తీసుకున్న చర్యల గురించి చర్చించారు. సాధ్యాసాధ్యాలతో పాటూ రైల్వేమార్గం, స్టేషన్లు వంటి అన్ని అంశాలతో సమగ్ర నివేదిక రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురైలలో త్వరితగతిన ప్రాథమిక పనులు ముగించి మెట్రో రైలు కుసంబంధించి అన్నిరకాల పనులపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
2025–2026 సంవత్సరానికి గాను తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ దాఖలుకు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆర్థిక పద్దును దాఖలు చేయనున్నారు. శనివారం రైతు సంక్షేమాన్ని కాంక్షించే బడ్జెట్ను వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం సభలో సమర్పించనున్నారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో పూర్తిస్థాయిలో చివరి బడ్జెట్ దాఖలుకు ఇదే అవకాశం కావడంతో జనరంజక పథకాలు, ప్రకటనలు ఉండవచ్చు అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఇప్పటి వరకు మూడుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో దాఖలు చేసింది. ఈ ఏడాది మే నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కాలంలో ప్రజల్ని ఆకర్షించే పథకాలను హోరెత్తించారు. ప్రధానంగా విద్యార్థి, మహిళలు, యువతీ, యువకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమలు చేసిన పథకాలు డీఎంకేకు మరింత బలంగా మారాయి. ఈ పథకాలే గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ డీఎంకే కూటమి క్లీన్స్వీప్ చేయడానికి మార్గాన్ని చూపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే కూటమి బలం పెరగడమే కాదు, సీఎం స్టాలిన్ పలుకుబడి సైతం పెరిగినట్టు సర్వేలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా గెలుపుతో మళ్లీ అధికార పీటాన్ని దక్కించుకునే విధంగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు.
జనరంజకంగా..
2025–2026 ఆర్థిక నివేదికను జనరంజకంగా తీర్చిదిద్ది ప్రకటించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ దాఖలుకు చివరి అవకాశం కావడంతో 2026 అసెంబ్లీ ఎన్నికలకు పునాదిని మరింత పటిష్టం చేసుకునే రీతిలో కొత్త పథకాలు, ప్రాజెక్టులను బడ్జెట్ ద్వారా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. 2026 మార్చి నాటికి ఎన్నిక లప్రక్రియ మొదలయ్యే అవకాశాలతో మధ్యంతర బడ్జెట్ను ఆ సమయంలో దాఖలు చేయడానికి వీలుంటుంది. అందుకే తాజా బడ్జెట్ను ప్రజాకర్షణ లక్ష్యంగా మలిచే విధంగా ఇప్పటికే ఆర్థికమంత్రి తంగం తెన్నరసు కసరత్తులు పూర్తి చేశారు. 2025–26 సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు సభ మొదలు కాగానే,బడ్జెట్ను ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇక శనివారం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం సభలో సమర్పించనున్నారు. అధికారులతో రోజూ సమావేశాలు, సమీక్షలు ఇప్పటికే ఆయన పూర్తి చేసి రైతులను ఆకర్షించే బడ్జెట్ను సిద్ధం చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆపరిసరాలలో భద్రతను కట్టదిట్టం చేశారు. ఇక సభలో డీఎంకేను ముప్పు తిప్పలు పెట్టే విధంగా అన్నాడీఎంకే, పీఎంకే, బీజేపీలు వ్యూహాలకు పదును పెట్టి ఉన్నాయి. శాంతిభద్రతల వైఫ్యలం, టాస్మాక్లో ఈడీ దాడులు, అవినీతి వంటిఅంశాలను అస్త్రంగా చేసుకుని సభను స్తంభింపజేసే దిశగా కార్యాచరణలో ఆ పార్టీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆర్థిక బడ్జెట్ను ప్రజలందరికి తెలియజేసే విధంగా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు జరిగాయి. చైన్నెలో 100 చోట్ల ఎల్ఈడీ స్కీన్ల ద్వారా ప్రసారం చేయడానికి చర్యలు తీసుకున్నారు. పార్కులు, బీచ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఇతర 24 కార్పొరేషన్లులో 48 చోట్ల,137 మునిసిపాలిటీలలో 274 చోట్ల, 425 పట్టణ పంచాయతీలలో 936 చోట్ల ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. దీంతో బడ్జెట్ మీద ఎదురుచూపులు పెరిగాయి
అభివృద్ధికి.. పంచతంత్రం
అభివృద్ధికి.. పంచతంత్రం