8 అరుదైన కోతులు, శునకం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

8 అరుదైన కోతులు, శునకం స్వాధీనం

Mar 14 2025 1:56 AM | Updated on Mar 14 2025 1:51 AM

ఇద్దరు యువకుల అరెస్టు

అన్నానగర్‌: వులేషియా నుంచి చైన్నె విమానాశ్రయానికి అ క్రమంగా తరలిస్తున్న 8 అరుదైన కోతులు, కుక్కలను కస్ట మ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి చె న్నైలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం రాత్రి మలేషియా ఎయిర్‌లైనన్స్‌ విమానం వచ్చింది. విమానంలో అరుదైన జాతులను అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్నిఫర్‌ డాగ్‌తో నిఘా పెట్టారు. విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో చైన్నెకి చెందిన ఇద్దరు యువకులను అనుమానించిన కస్టమ్స్‌ శాఖ అధికారులు వారిని విచారించారు. వారిద్దరు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వారు అతని వస్తువులను శోధించారు. వారు తెచ్చిన ప్లాస్టిక్‌ బుట్టలను వేరు చేయగా ఆ బుట్టల్లో అరుదైన జంతువులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారిద్దరినీ బ యటే నిలిపివేసిన అధికారులు, చైన్నె లోని బీసెంట్‌నగర్‌లోని వన్యప్రాణి క్రైం విభాగానికి సమాచారం అందించి సమన్లు జారీ చేశారు. బుట్టల లోపల తనిఖీ చేయగా కోతి–1, మార్బుల్‌ కో తి–2, తూర్పు బూడిద గిబ్బన్‌ కోతి–4 ఏషియాటిక్‌ శునకం 1 ఇందులో 8 అరుదైన జాతు లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి ఇండోనేషియా, యూరప్‌, చైనాలోని సుమత్రా, జావా ద్వీపంలో క నిపించే అరుదైన జాతులుగా గుర్తించారు. 8 అ రు దైన జాతుల్లో, 3 ఆసియాటిక్‌ వుడ్‌చక్‌ 1, తూర్పు సంబల్‌ గిబ్బన్‌ 2 చనిపోయాయి. మరో 5 అరుదైన జాతులు సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని అ క్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సజీవంగా ఉన్న 5 అరుదైన జాతులను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు తిరిగి పంపించారు. చనిపోయిన జంతువులను దహనం చేశారు. విమానంలో అక్రమంగా జంతువులను తరలించిన చైన్నెకి చెందిన ఇద్దరు యువకులను కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement