గృహిణులకు నెలకు రూ.2500 | - | Sakshi
Sakshi News home page

గృహిణులకు నెలకు రూ.2500

Mar 13 2025 11:52 AM | Updated on Mar 13 2025 11:47 AM

● నగదు సాయంపెంపు ● రూ. 13,600 కోట్లతో పుదుచ్చేరి బడ్జెట్‌ ● సభలో దాఖలు చేసిన సీఎం రంగస్వామి

సాక్షి, చైన్నె : కుటుంబ పెద్దగా ఉన్న గృహిణులకు నెలకు రూ. 2,500 నగదు సాయం అందజేయనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌. రంగస్వామి ప్రకటించారు.2025–26 సంవత్సరానికి గాను రూ. 13, 600 కోట్ల ఖర్చులతో పుదుచ్చేరిబడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ఆయన దాఖలు చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బడ్జెట్‌ సమావేశాలు సోమవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌ నాథన్‌ ప్రసంగంతో మొదలైన విషయం తెలిసిందే. రెండవ రోజుగా మంగళవారం ఈ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే విధంగా చర్చజరిగింది. మూడోరోజు సభలో ఉదయం ఆర్థిక శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్నసీఎం రంగస్వామి బడ్జెట్‌ దాఖలుచేశారు. సభకు ఆయన రాగానే స్పీకర్‌ ఎన్బలం సెల్వం బడ్జెట్‌ దాఖలకు అవకాశం కల్పించారు. దీంతో సభలో రంగ స్వామి ప్రసంగించారు. రూ. 13, 600 కోట్లతో బడ్జెట్‌ దాఖలు చేశారు. ఖర్చులు,ప్రాజెక్టులకు నిధులు, ఇతర అంశాలను ప్రస్తావించారు.

విద్యార్థులకు రూ.1000

బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకం మేరకు విద్యార్థులకు ప్రభుత్వ బడులలో వారంలో రెండు సార్లు పౌష్టికాహారంతో పాటూ గుడ్డు పంపిణీకి నిర్ణయించారు. 6 నుంచి 12 తరగతుల వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా సాయంగా నెలకు రూ. 1000 చొప్పున మూడు సంవత్సరాల పాటూ అందించేందుకు బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. పాఠశాలల విద్యార్థులు, ప్రజల సహకారంతో లక్ష మొక్కులు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

గృహిణులకు..

పాడిఉత్పత్తిని పెంపునకు 50 శాతం రాయితీతో పశువులను అందజేయనున్నారు. పుదుచ్చేరిలోని రెండు ఎగ్జిభిషన్లను పురాతనత చెక్కు చెదరకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అన్ని కుటుంబ కార్డు దారులకు నెలకు ఉచిత బియ్యంతోపాటూ 2 కేజీల గోదుమ ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు రూ. 2 వేలు ప్రోత్సహక నగదు పంపిణీ, ఈసీఆర్‌ రోడ్దులో కొత్తగానిర్మించిన బస్టాండ్‌కు దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ పేరు పెట్టనున్నామన్నారు. ఎమ్మెల్యేల నిధి రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. చివరగా కుటుంబ పెద్దగాఉ న్న గృహిణులకు ఇది వరకు అందజేస్తున్న నెలకు రూ. 1000 నగదు ప్రోత్సాహాన్ని రూ. 2,500లుగా పెంచుతున్నామని వివరించారు. అలాగే వృద్ధాప్య పింఛన్‌ రూ. 500 పెంచుతున్నామన్నారు.

సభలో

ప్రసంగిస్తున్న సీఎం

రంగస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement