సేలం : చిన్నారులను హోటల్కు రప్పించి, లైంగికంగా వేధించి, అసభ్యకరమైన సినిమా తీసిన వ్యవహారంలో మహిళా యూట్యుబర్లు దివ్యా, చిత్రతో పాటూ ముగ్గురిపై పోలీసులు గూండా చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో ఉన్న హోటల్లో చిన్నారులను లైంగికంగా వేధించి, వారితో అసభ్యకరమైన సినిమాలు చేయించిన కేసులో ప్రముఖ మహిళా యూట్యుబర్లు దివ్య (30), చిత్రా (54) అనే ఇద్దరు కొన్ని వారాల క్రితం అరెస్టు అయ్యారు. వీరికి సహకారంగా ఉన్న మరో యూట్యుబర్ కార్తీ (31), ఆనంద్ (24) జైలులో ఉన్నారు. ఈ స్థితిలో వీరు జామీన్ కోరుతూ పలుమార్లు శ్రీవిల్లిపుత్తూర్ కోర్టులో కోరారు. ఆ పిటిషన్లను రద్దు చేశారు. ఈ క్రమంలో యూట్యుబర్లు దివ్యా, చిత్ర, కార్తీక్ల పై మోపబడిన నేరారోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముగ్గురిపై గూండా చట్టం నమోదు చేస్తూ శ్రీవిల్లిపుత్తూర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజా, విరుదునగర్ జిల్లా సూపరింటెండెంట్ తదితరులు సిఫార్సు చేశారు. అందుకు అంగీకరించిన విరుదునగర్ జిల్లా కలెక్టర్ జయశీలన్, య్యూట్యూబర్లు చిత్ర, దివ్య, కార్తీలను గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నకళ్లను సంబంధిత జైలులో ముగ్గురికి మంగళవారం అందజేశారు.