తమిళసినిమా: నటి కుష్భూకు చెందిన అవ్నీ మూవీస్. ఆర్.మదన్కుమార్కు చెందిన బెంజ్ మీడియాతో కలసి నిర్మిస్తున్న నూతన చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్, 24 ఏఎం.స్టూడియోస్ వంటి పలు చిత్ర నిర్మాణ సంస్థలో దర్శకత్వం శాఖల్లో పని చేసిన అశ్విన్ కందసామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు సంతోష్, రేష్మా వెంకటేశ్, వినోద్ కిషన్, సమ్యుక్త విశ్వనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శాంతకుమార్ చక్రవర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర వివరాలను మీడియాకు విడదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది సరికొత్త కంటెంట్తో కూడిన వినోదంతో కూడిన ఫాంటసీ, ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఓ విచిత్రమైన జీవితం గురించి చెప్పే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. భిన్నమనస్తత్వాలు కలిగిన ఒక పాత్రతో పయనించే కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్ర టైటిల్ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. అన్వేషణ, లక్ష్యసాధన, ఆకర్షణ వంటి అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు. కాగా దర్శకుడు, నటి కుష్బూ భర్త సుందర్.సీ లేకుండా అవ్నీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
అవ్నీ మూవీస్, బెంజ్ మీడియా సంస్థల కొత్త చిత్రం