వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ తండ్రి వల్లల మహారాజుకు మాసి మాస పౌర్ణమిని పురష్కరించుకుని దర్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి రాజగోపురం దారిలో స్వామివారిని తిరువణ్ణామలైలోని పళ్లిగొండ పట్టు గ్రామం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. బుధవారం ఉదయం శివాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామి వారిని ఊరేగింపుగా గౌతమి నది వద్దకు తీసుకొచ్చి దర్పణ పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి శివాచార్యుల వేద మంత్రాల నడుమ తీర్థవారి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
గిరివలయం సమయం ప్రకటన
ఈనెల పౌర్ణమి సమయాన్ని ఆలయ అధికారులు ప్రకటించారు. గురువారం ఉదయం 11.40 గంటల నుంచి శుక్రవారం ఉదయం 12.57 గంటల వరకు పౌర్ణమి ఉంటుందని ఆ సమయంలో గిరివలయం వెళ్ల వచ్చునని ఆలయ అధికారులు ప్రకటించారు.