వేలూరు: నాట్రంబల్లిలో భారీ చోరీ జరిగింది. తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని అగ్రావరం గ్రామంలో ఓంశక్తి నగర్కు చెందిన ముత్తు మేకల వ్యాపారి. ఇతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ముత్తు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక ఉన్న తలుపులు, కిటికీ కమ్మీలు తీసి ఇంట్లోకి చొరబడి 40 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ముత్తు ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వేలి ముద్రలు స్వీకరించారు. అదేవిధంగా వేలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న సున్నపు వీధిలో మూడు దుకాణాల్లో చోరీ చోటుచేసుకుంది.