సాక్షి, చైన్నె: వినియోగదారులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెటింగ్, సేవా పరిష్కారాలను మెరుగుపరచడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టినట్టు పోతీస్ స్వర్ణ మహల్ డైరెక్టర్ అశోక్ పోతీ తెలిపారు. ఈ సహకారం అన్నది సేల్స్ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్ ద్వారా వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోతీస్ స్వర్ణ మహల్ డిజిటల్–ఫస్ట్ భవిష్యత్తును పరిగణించిందన్నారు. ఇందులో భాగంగా ఈ– మెయిల్, మెసేజింగ్, వాట్సాప్, వీడియో, చాట్, సోషల్ మీడియా నోటిఫికేషన్లలో కస్టమర్లు పరస్పరం సజావుగా అనుసంధానించే బహుళ–ఛానల్ వ్యూహాన్ని లవలంబించినట్టు వివరించారు. సేల్స్ఫోర్స్ ఏఐ –ఆధారిత పరిష్కారాలను సమగ్రపరచడం ద్వారా రిటర్న్–టు–స్టోర్ ప్రచారాలు, రియల్–టైమ్ ప్రమోషన్లు మెరుగు పడుతుదన్నారు. ఆన్లైన్ , ఆఫ్లైన్ టచ్పాయింట్లలో స్థిరమైన , సమర్థవంతమైన అనుభవాన్ని నిర్ధారించడానికి, కస్టమర్ సంబంధాలను బలోపేతం చేయడానికి, దక్షిణ భారతదేశం అంతటా వ్యాపార వృద్ధిని నడిపించడానికి ఓమ్నిఛానల్ వ్యూహాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఏఐ, ఆటోమేషన్ ద్వారా కార్యాచరణ నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు వీలుందన్నారు. సేల్స్ఫోర్స్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ – కన్స్యూమర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ మన్కిరణ్ చౌహాన్ మాట్లాడుతూ, డిజిటల్–ఫస్ట్ ప్రపంచంలో వ్యాపారాల అభివృద్ధి , అధునాతనమైన, వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవాలను అందించడం తమకు కీలకంగా పేర్కొన్నారు. రిటైల్ అనుభవాలను మార్చడం ఏఐ–ఆధారిత పరిష్కారాల శక్తికి నిదర్శనం అని వివరించారు. సేల్స్ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్ , కామర్స్ క్లౌడ్ను ఉపయోగించడం ద్వారా వినియోగ దారులకు మరింత చేరువ అయ్యేందుకు మార్గం సులభతరంగా కాకుండా, ఆధునీకరించే విధంగా ఉంటుందన్నారు.