డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

Jun 26 2025 6:07 AM | Updated on Jun 26 2025 6:07 AM

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

భానుపురి (సూర్యాపేట) : మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేసి సూర్యాపేటను డ్రగ్‌రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్‌ తేజస్‌నంద్‌ లాల్‌ పవార్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ‘అయామ్‌ యాన్‌ యాంటీ డ్రగ్‌ సోల్జర్‌’ అనే సెల్ఫీ పాయింట్‌ వద్ద ఎస్పీ నరసింహతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ బారిన ఎవరూ పడకుండా పోలీస్‌ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి అధికారి సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటో దిగి మాధ్యమాల్లో యువతకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారంలో అందరూ పాల్గొనాలన్నారు. గురువారం సూర్యాపేటలో జరగే ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌, ఎస్పీలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement