
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
సూర్యాపేటటౌన్ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత కృషి చేయాలని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26న యాంటీ డ్రగ్ డే ను పురస్కరించుకొని వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించినా అక్రమ రవాణా చేసినా రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు లేదా, సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగే అవగాహన ర్యాలీలో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొని యాంటి డ్రగ్ సోల్జర్ గా నమోదు చేసుకోవాలన్నారు.
ధర్నాను
విజయవంతం చేయాలి
నూతనకల్ : తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి కోరారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని కోరారు. కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరుగు యాదగిరి, పద్మం మల్లయ్య, పీడీ నాగేందర్, నారాయణదాస్, శ్రీనివాస్, రాములు, ఇరుగు సోమయ్య, వంగపల్లి రమేష్, పులుసు శ్రీనివాస్, యాస రాంకుమార్రెడ్డి, ఝాన్సీ, ఎల్లమ్మ, ఉమేష్రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్కు ఆహ్వానం
హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొహర్రం (పీర్ల పండుగ) కు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి ముజావర్లు బుధవారం హైదరాబాద్లో ఆహ్వాన పత్రిక అందజేశారు. వారితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా ఖాన్, తదితరులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. కార్యక్రమంలో ముజావర్లు ఎస్కే.సైదా, నాగుల్ మీరా, మీరాపాషా, హుజూర్నగర్ గౌడ్ సొసైటీ అధ్యక్షుడు వి.కృష్ణగౌడ్ పాల్కొన్నారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి