అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

Jun 26 2025 6:07 AM | Updated on Jun 26 2025 6:07 AM

అవకాశ

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థులు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభనువెలికి తీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్‌ సూచించారు. హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశాలకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక లు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి 34 మంది బాలురు, 16 మంది బాలికలలు ఎంపికలకు హాజరయ్యారు. వీరికి తొమ్మిది మోటార్‌ క్వాలిటీ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపనున్నట్టు జిల్లా స్పోర్ట్స్‌ అధికారి జి.రాంచందర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమములో ఎస్‌జీఎఫ్‌సెక్రటరీ ఆజమ్‌ బాబా, బాక్సింగ్‌ కోచ్‌ లోకేష్‌ రాజ్‌, వ్యాయామ ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి1
1/1

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement