
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : వనమహోత్సవ లక్ష్యాన్ని అన్నిశాఖలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో వనమహోత్సవం వాటర్ రీచార్జి స్ట్రక్చర్స్, ఇతర అంశాలపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఈసారి వనమహోత్సవంలో ఈత, తాటి వనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎకై ్సజ్, హార్టికల్చర్, ఫారెస్ట్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వారి పరిధిలోని స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించడానికి అధికారులు, బృందాలు రానున్నాయని తెలిపారు. ఎంపీఓలు పంచాయతీలోని టాక్స్ కలెక్షన్ల రికార్డులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. డైలీ శానిటేషన్ రిపోర్టును 100శాతం అమలయ్యేలా పనిచేయాలని తెలిపారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ఎస్బీఎం నరేందర్రెడ్డి. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉక్కుపాదం మోపాలి
మాదక ద్రవ్యాల వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన, స్లోగన్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు ఉందని మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు, పలు రంగాలకు చెందిన వ్యక్తులు మెడికల్ కాలేజీ నుంచి సద్దల చెరువు వరకు గురువారం జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప, అధికారులు హుస్సేన్, చంద్రశేఖర్, వినోద్, సంజీవ్, చైతన్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్