4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు | - | Sakshi
Sakshi News home page

4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు

May 4 2025 6:25 AM | Updated on May 4 2025 6:25 AM

4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు

4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు

నేడు నీట్‌ పరీక్ష

● సూర్యాపేటలో ఏర్పాట్లు

పూర్తి చేసిన అధికారులు

● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

సూర్యాపేటటౌన్‌ : మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఆదివారం(4వ తేదీ) నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)–2025కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు చేసింది. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలైన మోడల్‌ స్కూల్‌ ఇమాంపేట, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌–కళాశాల (బాలికలు ) ఇమాంపేట, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌–జూనియర్‌ కళాశాల దురాజ్‌పల్లి చివ్వెంల మండలం, గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో 890 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

మధ్యాహ్నం 1:30గంటల వరకే అనుమతి

విద్యార్థుల బయోమెట్రిక్‌ తీసుకుంటున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో కంట్రోల్‌ రూం, సీసీ కెమెరా లు, బందోబస్తు, 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌

నీట్‌ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ తెలిపారు. శనివారం సూర్యాపేట పరిధిలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థులు ఆభరణాలు, ఫుల్‌ హ్యాండ్‌ షట్స్‌, బూట్లు ధరించి వచ్చినా, ఎలక్ట్రానిక్‌ పరికరాలతో వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 1433 ఫోన్‌ చేయాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్య, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జయలత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement