
ఈదురుగాలుల బీభత్సం
కోదాడరూరల్ : మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన దోరకుంట, చిమిర్యాల, నల్లబంగూడెం, రామాపురం క్రాస్రోడ్, రెడ్లకుంటలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి చిమిర్యాలలో కలకొండ పద్మ ఇంటిపై వేపచెట్టు విరిగి పడగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నది. రెడ్లకుంటలో యామపంగు దిలీప్, పిడమర్తి పెద్ద సైదులు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోగా మరో రెండు ఇళ్లు, నల్లబంగూడెంలో మూడు ఇళ్లు పాక్షింకంగా దెబ్బతిన్నాయి. ఆరబోసుకున్న ధాన్యం రాశుల కిందకు నీరు చేరి పాక్షికంగా తడిశాయి. ఆయా గ్రామాల్లో రోడ్ల వెంట ఉన్న చెట్ల కొమ్మలు విరిగాయి. 15 విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో తెల్లవారుజామున 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు విద్యుత్ను పునరుద్ధరించారు. అలాగే నల్లబండగూడెం, రెడ్లకుంట, కాపుగల్లులో ఈదురుగాలులకు దాదాపుగా 90 ఎకరాల్లో మామిడి, సపోట పంటలకు నష్టం జరిగింది. ఆయా తోటల్లో చెట్లు విరిగి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ కూలిన విద్యుత్ స్తంభాలు, విరిగిన చెట్లు
ఫ లేచిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు
ఫ మామిడి, సపోట తోటల్లో రాలిన కాయలు

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం