
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ హెచ్చరించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారులో వివాదాస్పద భూమిని అక్రమంగా పట్టా చేసిన విషయమై ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ఈనెల 24వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ పి.రాంబాబును నియమించారు. వివాదాస్పద భూమి పట్టా విషయం, మండల రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరుపై విచారణ నిర్వహించి పూర్తి నివేదికను తక్షణమే అందించాలని ఆయన ఆదేశించారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
ఫ భూమి అక్రమపట్టాపై విచారణ అధికారిగా అదనపు కలెక్టర్