
విజేత.. బాపట్ల జిల్లా గిత్తలు
మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఎద్దుల పందేల్లో కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా చండూరుకు చెందిన శిరీషాచౌదరి, శివరామకృష్ణచౌదరి గిత్తలు ప్రథమ బహుమతిని గెలుపొందాయి. రెండవ బహుమతిని పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన బ్రహ్మనాయుడు గిత్తలు, మూడవ బహుమతి పల్నాడు జిల్లా మాచవరంనకు చెందిన లక్ష్మయ్యచౌదరి గిత్తలు పొందాయి. విజేతలకు చర్చి కమిటీ యూత్ సభ్యులు నగదు, షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ ఆదూరి స్రవంతికిషోర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చిన్నపరెడ్డి, మధుసూదన్రెడ్డి, బాల్రెడ్డి, బాలశౌరిరెడ్డి, ఆంటోనిరెడ్డి, థామస్రెడ్డి, సోసఫ్రెడ్డి, కిరణ్రెడ్డి, రాకేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బండ లాగుతున్న బాపట్ల జిల్లా గిత్తలు