
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవ చేయాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో ఏప్రిల్ నెలలో వచ్చే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇలాంటి కార్య క్రమాలు వృద్ధాప్యంలో ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్కల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువరప్రసాద్, హనుమారెడ్డి, విద్యాసాగర్, పొట్టా జగన్మోహన్రావు, వెంకటేశ్వరరావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.