
కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ రెడ్డి, పరమేష్, నవీన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని
58 బైక్లు, ఆటో సీజ్