రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎచ్చెర్ల: మండలంలో కుశాలపురం గ్రామానికి సమీపంలోని ఫ్లై ఓవర్‌పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని భైరి గ్రామానికి చెందిన కొంగరాపు రంగయ్య మృతి చెందగా, బూరె లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరి గ్రామానికి చెంది న బూరె లక్ష్మణరావు, కొంగరాపు రంగయ్యలు మేకను అమ్మేందుకు లావేరు మండలంలోని బుడుమూరు సంతకు మోపెడ్‌పై వెళ్లారు. మేకను సంతలో అమ్మి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహ నం నడుపుతున్న లక్ష్మణరావు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక కూర్చున్న రంగయ్య రోడ్డుపై పడ్డారు. దీంతో రంగయ్య (50) తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. 108 సాయంతో వీరిని రిమ్స్‌కు తరలించారు. రంగయ్య కుమారుడు లక్ష్మీనారాయ ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్యకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

హైదరాబాద్‌లో సోంపేట యువకుడు మృతి

సోంపేట: పట్టణానికి చెందిన యువకుడు వికాష్‌కుమార్‌ నెపాక్‌ హైదరాబాద్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేటలోని నేతాజీ నగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు లింగరాజ్‌ నెపాక్‌ కుమారుడు వికాష్‌కుమార్‌ నెపాక్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వికాష్‌ మృతితో నేతాజీ నగర్‌లో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement